Pages

Tuesday, April 26, 2011

సాయం చేసే చేతులు మిన్న

Let it reach the 110 Crores Indians and the remaining
if any.
Kindly, share this valuable information wherever
possible.


1. If you see children Begging anywhere in TAMIL NADU:
please contact: "RED SOCIETY" at 9940217816. They will help the children for their studies.

2. Where you can search for any BLOOD GROUP:
 you will get thousands of donor address. www.friendstosupport.org

3. Engineering Students can register In:
www.campuscouncil.com
to attend Off Campus for 40 Companies.

4. Free Education and Free hostel for Handicapped/Physically Challenged children:
Contact:- 9842062501 & 9894067506.

5. If anyone met with fire accident or people born with problems in their ear, nose and mouth can get free PLASTIC SURGERY done by Kodaikanal PASAM Hospital.
From 23rd March to 4th April 2011 by German Doctors.
Everything is free. Contact : 045420-240668,245732.

6. If you find any important documents like Driving license, Ration card, Passport, Bank Pass Book, etc., missed by someone, simply put them into any near by Post Boxes. They will automatically reach the owner and Fine will be collected from them.

7. By the next 10 months, our earth will become 4 degrees hotter than what it is now. Our Himalayan glaciers are melting at rapid rate. So let all of us lend our hands to fight GLOBAL WARMING.
-Plant more Trees.
-Don't waste Water & Electricity.
-Don't use or burn Plastics.

8. It costs 38 Trillion dollars to create OXYGEN for 6 months for all Human beings on earth.
"TREES DO IT FOR FREE" "Respect them and Save them".

9. Special phone number for Eye bank and Eye donation: 044-28281919 and 044-28271616 (Sankara Nethralaya Eye Bank).
For More information about how to donate eyes plz visit these sites. http://ruraleye.org

10. Heart Surgery free of cost for children (0-10 yr) Sri Valli Baba Institute Banglore. 10.
Contact : 9916737471.

11. Medicine for Blood Cancer!!!
'Imitinef Mercilet' is a medicine which cures blood cancer. It’s available free of cost at "Adyar Cancer Institute in Chennai". Create Awareness. It might help someone.
Cancer Institute in Adyar, Chennai
Category: Cancer
Address:
East Canal Bank Road,
Gandhi Nagar, Adyar
Chennai -600020
Landmark: Near Michael School
Phone: (044) 24910754, 24910754, 24911526, 24911526,
22350241, 22350241.

12. Please CHECK WASTAGE OF FOOD
If you have a function/party at your home in India and food gets wasted, don't hesitate to call 1098 (only in India)
- It’s not a Joke, This is the number of Child helpline.They will come and collect the food. Please circulate this message which can help feed many children.


"AND LETS TRY TO HELP INDIA BE A BETTER PLACE TO LIVE IN"


Please Save Our Mother Nature for "OUR FUTURE GENERATIONS"
Let it reach the 110 Crores Indians and the remaining if any. "Helping Hands are Better than Praying Lips".


Loka Samastha Sukhino Bhavantu
(May all the people of the world be happy).....................................సతీష్.(నా Friend అందించిన విలువైన సమాచారం మీ ముందు ఉంచుతున్నాను).
                                                                    

Thursday, April 21, 2011

చెంచలంబకు జగతిలోపల శాశ్వతంబు ఒకటేదిరా….

"చెంచలంబకు జగతిలోపల శాశ్వతంబు ఒకటేదిరా….
కట్టె బొగ్గు కాలేటప్పుడు కాసునైనను రాదురా…........

నీది నాది అనుచు నరులు వాదులాడుచు ఉన్డేరా…...
చెంచలంబకు జగతిలోపల శాశ్వతంబు ఒకటేదిరా"

చిన్నపుడు ఉరిలో దశరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతుండేవి.అందులో పిల్లలందరూ పూజ ఎప్పుడు పుర్తవుతుందా ప్రసాదం ఎప్పుడు పెడతారా, డాన్సులు, సినిమాలు ఎప్పుడు వేస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు డాన్సు వేసేవాళ్ళు , CD ప్లయెర్స్ అన్ని ఉన్న గాని పూజ కార్యక్రమం అయ్యే టైం కి ఎక్కడి నుండి వచ్చే వాళ్ళో గాని ఊర్లో ఉన్న కాస్త వ్రుద్దులంతా చిడతలు పట్టుకుని గద్దె దగ్గరకు చేరే వాళ్ళు భజన చేయడానికి.వాళ్ళని చూడగానే వార్తలు అయ్యే అంత వరకు కర్రెంట్ ఉండి చిత్రలహరి స్టార్ట్ అవ్వగానే కరెంటు పోతే ఉండే అంత బాధ కలిగేది పిల్లలందరికీ.

పూజ అయిపోగానే ప్రసాదం తీసుకుని పెద్దవారందరూ భజన స్టార్ట్ చేసేవారు.ఆ భజన అయ్యేసరికి పిల్లలు అందరు నిద్రలోకి జారుకునే వాళ్ళు, రోజు ఇదే తంతు.అలా చూసి చూసి నేను కూడా ఆ భజన బాచ్ లో మెల్లగా జాయిన్ అయిపోయాను, తప్పులో ఒప్పులో పాడుతూ వాళ్ళతో శృతి కలపడం మొదలేసాను. అలా పాడుతూ పాడుతూ త్వరగా మంగళం పాడేసి భజనని క్లోజ్ చేసి ఇక మా డాన్సులు సినిమాలు స్టార్ట్ చేసేవాళ్ళం.

అలా పాడుకున్న రోజులలో బాగా గుర్తున్న భజన పాటే పైన చెప్పిన "చెంచలంబ" పాట.అప్పుడు అది పాడుతున్నప్పుడు దాని అర్ధం ఏమి తెలీదు ఏదో అందరు పాడుతున్నారు మనం కూడా పాడుతున్నాము అంతే.కాని దాని అర్ధం తెలిసే వయసు వచ్చే సరికి భజనలు లేవు దశరా ఉత్సవాలు లేవు ఉరిలో.నిజంగానే ఈ చెంచలం అయిన ఈ జీవితం లో శాశ్వతము అంటూ ఏముంది. ఇదేదో వైరాగ్యంతోనో విచారం తోనో చెప్తున్న మాటలు కాదు.మన జీవితం అలానే అయింది నిజంగానే. మనం పుట్టేటప్పుడు కనీసం ఒక చిన్న నూలుపోగు కూడా లేకుండా పుడతాము అలానే పోయేటప్పుడు ఒక్క నూలు పోగు కూడా తీసుకుని వెళ్ళము.ఇది జగమెరిగిన సత్యం కాని ఈ రెండిటికి మద్యలో మాత్రం దేనికో ఈ ఆరాటం ఈ పోరాటం.

ఈ ఆరాటం,పోరాటం వద్దు అనట్లేదు కాని మనిషికి మనిషికి మధ్య ఉన్న మానవతా విలువలను కూడా వదిలేసి పోరాడే అంత పోరాటాలు మనకి అవసరమా అని నా ఉద్దేశం.సాటి వాడు ఆపదలో ఉన్నాడు అంటే కనీసం వాడికి మద్దతు పలకడానికి కూడా మనసు రాణి పరిస్థుతుల మద్య మనం ఉన్నాము. ఎంతో మంది ఆకలితో మాడిపోతున్నారు రోజు కనీసం కట్టుకోడానికి గుడ్డ ఉండటానికి చిన్న గుడిస కూడా లేని స్థితి లో చాలా మంది ఉన్నారు కాని బాబాల ఆశ్రమాలలో డబ్బు,బంగారం ట్రక్కులతో తోలుతున్నారు అని TV లలో చూస్తున్నాము.అది ఎవరి డబ్బు ఎక్కడికి తోలుతున్నారు….? సాటి వాడు ఆపదలో ఉంటె ఆదుకోలేము కాని బాబాలను స్వాములను నమ్మి వారి వారి సంస్థలలో దొంగ డబ్బుని మాత్రం దాచుకుంటారు మనవారు.

అస్సలు స్వాములు బాబాలు అంటే ఏంటి " నిస్స్వార్దంగా అన్ని వదిలేసి నిరాడంబరంగా జీవితాన్ని గడపాలి" కాని మన దేశంలో స్వాములకు పెద్ద పెద్ద పీటాలు,పెద్ద పెద్ద ఆస్తులు వారి వెనక కోట్ల విలువలు చేసే సంపదలు. ఇక కొంతమంది బాబాలు అయితే చెప్పలేని పనులు కుడా చేస్తారు(కాని వాళ్ళని మన పిచ్చి జనాలు ఫోటోలు పెట్టి మరి పుజిస్తారు) ఇవ్వన్ని ఎందుకండీ వీరికి.మల్లి మన ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు కుడా వీరికి పాద దాసులు లా మారుతారు,మారి వీరి నల్ల ధనం ను దాచుకొనే పనిలో పడతారు.ఇది మన దేశ దుస్తుతి.

దేశం లో ఉన్న బాబాల ఆస్తులను జప్తు చేసి కనీసం ఒక పూట తిండి కూడా తినలేని సామాన్యుడికి ఉపయోగపడేలా చేస్తారో లేక మన నాయకులు ఆ సొమ్మును కూడా కుక్కలు చింపిన విస్తరి లా పీక్కుని తింటారో వేచి చూద్దాము………………….......సతీష్  


                                                                         

Friday, April 15, 2011

నోట్ల తో కొనలేని ఓట్లు

డబ్బు గెలుస్తుందా…?లేక అధికారం గెలుస్తుందా….? ఇప్పుడు కడప ఎన్నికలలో ఆసక్తిగా మారిన విషయం.ఈ ఎన్నికల వలన మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేకపోయినా,కడప ఆదిపత్య పోరుకు సిద్దమయింది.ఇవి ఎన్నికలు అనడం కన్నా డబ్బు కి అధికారానికి మధ్య ఆదిపత్య పోరు అనడం సబబేమో.మామూలుగా రాష్ట్రం లో ఎన్నికలంటే అల్ప సంతోషి అయిన ఓటరు యాబయ్యో వందో వస్తాయని చంకలు గుద్దుకుంటాడు కాని కడపలో ఆ ఓటు విలువ వందల నుండి వేలల్లోకి దాటిపోయింది.

ఎక్కడో తమిళనాడు లోని ఎన్నికలు చూసి విరక్తి కలిగింది,ప్రజాస్వామ్యం నాశనం అయిందే అనే చిన్న బాధ కలిగింది.ఇంటికో mixi,fan,TV ఇలా నోటికి అందినన్ని ఫ్రీ బహుమతులను ఇస్తామంటే అవాక్కవడం మన వంతు అయింది.సరే ఒకందుకు ఆలోచిస్తే అది రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి మరియు ప్రభుత్వం ఏర్పరచడానికి పడే పాట్లు కాని మన రాష్ట్రం లో ఒక MLA, MP ల కోసం తమిలనాడుకంటే ఎక్కువగా స్రమిస్తున్నారంటే(డబ్బు పెట్టడానికి) మన నాయకుల లో ప్రజా సేవ కంటే అధికార దాహం,ఆధిపత్యం కోసం పడే తపన ఎంతగా పెరిగాయో అర్ధం చేసుకోవచ్చు.

ఇలాంటి ప్రమాదకర పోటి మద్యలో ఒక మంచి,నిస్వార్ధం కల్గిన నాయకులు ఎవరన్నా నిలబడగలరా…? ఒకవేళ నిలబడ్డా గాని బ్రతికి బయటపడనిస్తారా..? మన ఈ నాయకులు. ఇలా తయారయింది మన ప్రజాస్వామ్య వ్యవస్థ. ఎన్నికల అఫ్ఫిడవిట్ లో కనీసం సొంత కారు,బ్యాంకు బాలన్స్ లేదు అని చూపిచ్చుకునే మన నాయకులకు ఎన్నికలలో మాత్రం పంచడానికి కోట్లు ఎక్కడనుండి వస్తున్నాయో మన ఎన్నికల కమీషన్ కి తెలియకపోవడం వింతే మరి.

ఇంత బహిర్గతంగా అక్రమాలు జరుగుతుంటే మన చట్టాలు కాని,మన ఎన్నికల అధికారులు కాని ఏమి చేస్తున్నట్లు..!నిదురపోతున్నాయా...? అంత పెద్ద పెద్ద వారే ఏమి చేయకుండా చూస్తూ ఉంటె ఇక సామాన్యుడు ఏమి చేస్తాంలే అని తప్పక తమ ఓటు ని ఏదో ఒక దుర్మార్గుడికి వేయాల్సిన తప్పని పరిస్థితి వస్తుంది(మరి అస్సలు ఓటు వేయకపోతే అదొక నేరం కదా).


అందుకే ధైర్యం గా ఏమి చేయలేని ఈ సామాన్యుడికి ఒక అవకాశం ఇవ్వాలి,గొప్ప గొప్ప మేధావులు చెప్పినట్లు ఓటు బ్యాల్లేట్ పేపర్ లో ఓటు ఏ అబ్యర్ది కి వేయడం ఇష్టం లేదని తెలియచేయడానికి ఒక గుర్తుని కేటాయించాలి.అక్కడ ఏ నాయకుడు సరి అయిన వాడు కాకపొతే తమ ఓటు ఎవరికి వేయట్లేదని తెలియచేసే అవకాశం ఓటరుకి కల్పించాలి అలాంటి ఓట్లు ఎక్కువ వస్తే అక్కడ ఎన్నికలని రద్దు చేసి అక్కడ పోటి చేసిన అభ్యర్దులను అనర్హులగా ప్రకటించాలి.ఇలాంటి అవకాశం ఇస్తే ప్రజలు గోప్యంగా అయినా ఈ అన్యాయాన్ని ఈ అక్రమార్కులను వ్యతిరేకించే అవకాశం వస్తుందని నా అభిప్రాయం……………సతీష్.

                                                         

Thursday, April 7, 2011

జన లోక్పాల్ బిల్లు…..అవినీతికి చిల్లు

బాబా BP ఇంతుంది, షుగర్ అంతుంది,బాబా ఆరోగ్య పరిస్థితి మీద ప్రత్యేక బుల్లెటేన్. KCR ఇప్పుడు ఏమి చేస్తున్నారు.తెలుగు దేశం లో వర్గ పోరు.కడప ఎలేక్షన్స్ లో అబ్యర్దులు ఎవరు చూస్తూనే ఉండండి కాసేపట్లో.. TV ఆన్ చేస్తే చాలు ఉదయం మొదలు రాత్రి పడుకునే వరకు ఇదే వార్తలు ఒక వారం రోజులు గా. ఇవి వార్తలు కావు అని నా అభిప్రాయం కాదు.మూడు రోజులు గా ఆమరణ నిరాహార దీక్ష(మన రాజకీయ నాయకుల దీక్షల లాంటిది కాదు లెండి) చేస్తున్నా ఏ APమీడియా మిత్రులకు కనిపచ్చలేదు.

                                                                       
బాబా చాలా మంచి వ్యక్తే కాదని నేను అనను ఆయన చాలా స్వచ్చంద సేవలను చేసిన గొప్ప వ్యక్తే అందులో ఎటువంటి అనుమానం లేదు.కాని బాబా చావుని బేస్ చేసుకుని వారి ట్రస్ట్ లో ఏదో కుంబకోణం జరుగుతుంటే బాబా ఆస్తుల మీద,అది వదిలేసి ఈ మీడియా లేని పోనీ హడావుడి చేస్తూ TRP రేటింగ్ కోసం రోజంతా అదే న్యూస్.మా అంటే బాబా ఒకటి లేదా రెండు కోట్ల మంది కి ఆరద్యులు,ఇక తెలంగాణా ఉద్యమం నాలుగు కోట్ల మంది ఆశయం, కాని మన "అన్న హజారే" గారు చేసే ఉద్యమం నూట ఇరవయ్ ఒక్క కోట్ల మంది కి ఉపయోగపడే ఉద్యమం.అలాంటి ఉద్యమం గురించి ఒక్క అయిదు నిముషాలు చూపించే టైం మన AP మీడియా కి లేదు అంటే చాలా సిగ్గుగా ఉంది.

ప్రపంచం లో ఏ విషయం ఎవరికి తెలియాలన్న మీడియా నే మూలా కారణం. అలాంటిది "అన్న హజారే" గారి ఉద్యమం కాని,"జన లోక్పాల్ బిల్లు" కాని మనలో చాలా మందికి తెలీదు అంటే మన మీడియా దాని గురించి యెంత పట్టిచ్చుకుంటుందో అర్ధమవుతుంది.మల్లి మీడియా లో పెద్ద పెద్ద ప్రకటనలు "అవినీతి ని అరికడదాం","ఫ్యాక్షనిస్టుల ఆస్తులను ప్రభుత్వానికి అప్పచెప్పండి". ఇలా లేనిపోని స్పీచులు ఇవ్వడం తప్ప చేసేది ఏమి లేదు.మ్యాచ్ గెలిస్తే బట్టలు ఇప్పుకుని తిరిగుతా అని ఒక మోడల్ చెప్తే అది హెడ్ లైన్స్ లో వేసే మన మీడియా 72 సంవత్సరాల వ్యక్తి మన కోసం మన భవిష్యత్తు తరాలకోసం పోరాడుతుంటే వీరికి కనీసం చీమ కుట్టినట్లు కుడా అనిపిచ్చట్లే.ఆయన పోరాడేది అవినీతి మీద,ఆయనకు దూరం గా ఉండేది అవినీతిపరులు,అంతేలే మీడియా కుడా ఎప్పుడో అవినీతి రొచ్చు లో కూరుకుపోయింది కాబోలు అందుకే దూరం గ ఉంటున్నారు పాపం.

"జన లోక్పాల్ బిల్" 42 సంవత్సరాలు గా ఆమోధపొందని  బిల్లు.నిజంగా ఈ బిల్లు ఆమోదం పొందటానికంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలి ఎందుకంటె ప్రపంచం లో ఏ బిల్లు ఇన్ని సంవత్సరాలు ఆమోదం పొందకుండా లేదు అనుకుంట.ఏమవుతుంది ఈ బిల్లుని ఆమోదిస్తే ఈ రాజకీయ నాయకుల కుర్చీలు కదులుతాయి కాబోలు .. లేక చెదలు పట్టి పేరుకుపోయిన ఈ బడా బాబుల డబ్బులు చేదురుతాయి కాబోలు... ప్రతి ఒక్కడు ఏ స్టేజి లో ఉన్నాడంటే అవినీతి కి వ్యతిరేఖం గా పోరాడే "హజారే" గారికి సప్పోర్ట్ గ ఒక స్టిక్కర్ ని తన వాహనానికి అంటిచుకోమని అడిగితే నాకేమి ఇస్తారు అనే రీతిలో అవినీతి పేరుకుపోయింది మన దేశం లో.

దయచేసి ఇప్పటికన్నా "JANA  LOKPAL BILL " అవసరం ఏంటో, అసలు ఆ బిల్లు వలన మనదేశానికి ఉపయోగమెంతో తెలుసుకుందాం. ఆ బిల్లు ను ఆమోదిన్చేదాక మన వంతుగా "అన్న హజారే" గారికి మన పూర్తి మద్దతుని అందిద్దాం అని ఆసిస్తూ……………..సతీష్.

I support  JANA LOKPAL BILL...........

R U......?



జై భారత్ మాత కి జై.

Friday, April 1, 2011

నేను సైతం.....

రోజు టీవీ ల లో పేపర్ ల లో చూస్తూ ఉంటాం. మన దేశం కరప్షన్ తో నిండి పోయింది అని విని బాధ పడతాం కొద్దిసేపు తరువాత మనమేమి చేయగలం లే అని ఊరుకుని మన పనిలో మనం మునిగి పోతాం. రోజు అందరి జీవితాలలో జరిగే మామూలు విషయమే ఇది. కాని ఒకే ఒక్కడు 72 సంవత్సరాల వయసు ని మన స్వేచ్చకోసమే త్యాగం చేసి, ఈ వయసులో కుడా మన స్వేచ్చకోసం పోరాడడానికి సిద్దమయిన ఒకే ఒక వ్యక్తి "అన్న హజారే".

స్వతంత్రసమరయోధుడు, పద్మ భుషణుడు అయిన అన్న హజారే గారు ఈ నెల 8 న డిల్లి లో అవినీతి వ్యతిరేఖ చట్టం "జన లోక్పాల్ బిల్" కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.దీనికి మనం ఆనందించాలో లేక బాధపడాలో అర్ధం కావట్లే. బాధపడాలో అని ఎందుకు అన్నానంటే. వారి జీవితం మొత్తం మనకు స్వేచ్చని అందించడానికి త్యాగం చేసి ఈ దేశాన్ని మన చేతిలో పెడితే, మన రాజకీయ నాయకులు దేశాన్ని అవినీతి తో దోచుకు తింటుంటే ఈ యువత కాని ఏ పౌరుడు కాని పట్టిచుకోకుండా తన స్వార్ధానికి తను బ్రతుకుతుంటే చూడలేక ఈ వయసులో కూడా మల్లి నడుం బిగించి అవినీతి మీద పోరాడటానికి సిద్డంయ్యరంటే మనం సిగ్గుతో తల దిన్చుకోవాల్సిందే.

"నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోసకు వెర్రి గొంతుక విచ్చి ఒసానూ
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను"

ఇప్పటికయినా మన మనసులోనే అనుచుకున్న భావాన్ని బయటికి తీద్దాం. ఈ ఉద్యమానికి మనవంతు సాయాన్ని అందిద్దాం.ప్రతి పౌరుడు బాధ్యతగా కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని ఉదృతం చేసి కనీసం అవినీతి తో అంధకారం లో ఉన్న ఈ ప్రభుత్వాలకు కనువిప్పు కల్పిద్దాం.
తెలుగు వారిగా, ఆంధ్ర ప్రజల గా మనం "లోక్పాల్ బిల్" ను సమర్దిస్తూ ఈ ఏప్రిల్ 5th న KBR పార్క్ జుబ్లిహిల్ల్స్ లో జరిగే ఉద్యమానికి మద్దతుగా మనవంతు కృషి చేస్తూ ఉద్యమం లో పాల్గొనడం భారత దేశ పౌరుల గా మన బాధ్యత అని ఆసిస్తూ.........................సతీష్

ఏప్రిల్ 5th మంగళ వారం,
ఉదయం 8  గంటలకు,
KBR  పార్క్,
జుబ్లీహిల్స్,
హైదరాబాద్,
ఫోన్ : 9676360111
9849109540