Pages

Sunday, May 30, 2010

వేణువయి వచ్చాను భువనానికి

పిచ్చోడి చేతిలో రాయి అది ఎక్కడికి వెళ్తుందో తెలీదు,అదే రాయి ఒక కార్మికుడి చేతిలో పడితే ఒక గొప్ప కట్టడం లా తయారవుతుంది,ఒక శిల్పి చేతిలో పడితే అందమయిన శిల్పం లా మారుతుంది.అదే రాయి మన వేటూరి గారి కలం లో పడితే సుందరమయిన పాటలా మారుతుంది.వేటూరి సుందర రామమూర్తి ఆ మొదటి అక్షరం 'వే' లోనే ఉంది వేణువు.సుందరమయిన వేణువు లాంటి వారు ఆయన.వేణువుని ఎంత సుందరం గా పలికిస్తే అంత అందం గా పలుకుతుంది, దాన్ని వాయించే వాళ్ళని పట్టి ఉంటుంది దాని గానం.అలానే ఎవరికి ఎలాంటి పాట కావాలంటే అలాంటి పాటను అందించకల్గిన ఒకే ఒక వ్యక్తి వేటూరి గారు.రౌద్రం(ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో,మూవీ: "ప్రతిఘటన"),విషాదం(ఆకాశాన సూర్యుడుండడు సందేవేలకే,మూవీ:"సుందరకాండ"),జానపదం(జాణవులే నెర జాణవులే,మూవీ :"ఆదిత్య 369"),మెలోడి (వెన్నెలవే వెన్నెలవే,మూవీ :“మెరుపు కళలు”,మాస్(ఆ అంటే అమలాపురం,మూవీ :“ఆర్య” ),ఇలా నవరసాలను తన పాటలలో చొప్పించి మనకు అందించిన మహానుబావుడు వేటూరి సుందర రామ మూర్తి.
వేటూరి గారి పాటల కోసం ఇక్కడ  క్లిక్  చేయండి 
"అందరూ పుడతారు కొంతమంది కోసం కాని కొందరే పుడతారు అందరికోసం".వేటూరి గారు 29th January 1936 లో కొల్లూరు (తెనాలి) లో జన్మించారు,తను కలం పట్టిన దగ్గరినుండి తన పాటల ప్రవాహం తను కన్ను మూసే వరకు ఆగలేదు.తను ఆకరిగా హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా మన ప్రభుత్వం(ప్రజా పథం) కోసం ఒక పాట రాసారు,కాని తనకు ఏ ప్రభుత్వం కాని,తను నమ్మిన సినిమా ఫీల్డ్ కాని తనకి ఉండటానికి ఒక సొంత ఇల్లు ని కూడా కల్పించలేకపోయారు.కాని తను చనిపొఇన తరువాత పెద్ద పెద్ద సభలు ఉపన్యాసాలు ఇచ్చారు మన వాళ్ళు."పోఇన వారు పుణ్యాత్ములు ఉన్నవారు వారి తీపి గుర్తులు" కాని వేటూరి గారి విషయం లో "పోయిన వారు పుణ్యాత్ములు మిగిలి ఉన్న ఆయన పాటలు మనకు ఎప్పటికి తీపి గుర్తులు".ఒకప్పుడు హీరో ని చూసో హీరొయిన్ ని చూసో సినిమా కి వెళ్ళే వాళ్ళు కాని కేవలం ఆత్రేయ గారి పాటల వల్లనే ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయంటే అది అతిశయోక్తి కాదేమో.మాతృదేవోభవ ఈ సినిమా పాటలు విని కళ్ళు చెమర్చని వారంటూ ఉండరేమో.
ధనం కోసమే కలం పట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్న ఈ కాలం లో కుడా పయిస కూడా ఆశించకుండా ఎంతోమందికి పాటలు రాసిన గొప్ప వ్యక్తి.అలాంటి మహానుభావుడ్ని మన ప్రభుత్వం కాని సిని ఫీల్డ్ కాని ఒకింత తక్కువ చేసి చూసిందనే నా అభిప్రాయం.శారీరకం గా ఆయన మనకుదూరమయినా కాని,పాట బ్రతికి ఉన్నంత కాలం వేటూరి గారు చిరంజీవి గానే ఉంటారు.ఎలాగూ వారు ఉన్నప్పుడు వారి సొంత ఇంటి కలని నెరవెర్చలేకపోయినా కనీసం వారి ఆత్మ శాంతించే లా వారి కుటుంబ సబ్యులకన్నా ఆ అవకాశాన్ని కల్గిస్తారని, ఆ మహానుభావుడికి నివాళులు అర్పించడానికి ఇన్ని రోజులు లేట్ అయినందుకు నన్ను నా బిజీ లైఫ్ ని దూషించుకుంటూ మనస్పూర్తి గా "వేటూరి సుందర రామ మూర్తి" గారికి నివాళులు అర్పిస్తూ………
వేటూరి గారి గురించి ఈ వీడియో ని క్లిక్ చేయండి.


.
Your’s……………………………….సతీష్. 

Saturday, May 22, 2010

గమ్యం

ఆఫీసు సీట్ లో వెనక్కి వాలి దీర్గం గా ఆలోచిస్తున్నా అర్ధం కాని ప్రోగ్రాం ని చూస్తూ.ఇంతలో ఫోన్ రింగ్ అయింది చుస్తే మా ఇంటిదగ్గర నుండి నాన్న ఫోన్ చేసారు,నాన్న “అరేయ్ మన పక్కింటి నాగేశ్వర రావు అంకుల్ మాట్లాడతారట అని ఆయనకు ఫోన్ ఇచ్చారు.అంకుల్: “బాబు బాగున్నావా",నేను : "అంకుల్ బాగున్న మీరెలా ఉన్నారు చెప్పండి అన్నాను",అదే మన రవి ఉన్నాడు కదా(అంకుల్ వాళ్ళ అబ్బాయి),వాడు ఈ సంవత్సరమే ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు,వాడు హైదరాబాద్ వెళ్త అంటున్నాడు దాని గురించే నీతో ఒకసారి మాట్లాడుదామని,అదే నానా మీ కంపెనీ లో ఏమన్నా జాబ్ వాడికి కాస్త చూస్తావని".నేను:"సరే అంకుల్ చూద్దాం రమ్మనండి అని మాట్లాడి ఫోన్ పెట్టేసాను".ఒక్కసారి మళ్లీ నా సీట్ లో వెనక్కి వాలి 3years బ్యాక్(ఫ్లాష్ బ్యాక్)కి వెళ్ళాను.ఫ్లాష్ బ్యాక్ లో రవి ప్లేస్ లో నేను నా ప్లేస్ లో మా బావ.అప్పుడే కొత్తగా డిగ్రి కంప్లీట్ అయి ఊర్లో కాలిగా తిరుగుతున్న రోజులు,మా మామయ్యా వాళ్ళ అబ్బాయి(బావ)హైదరాబాద్ లో ఏదో పెద్ద జాబ్ చేస్తున్నాడు,తనకి మా పెదనాన ఫోన్ చేసి "అరేయి మన వాడు హైదరాబాద్ వస్తా అంటున్నాడు ఏదన్నా జాబ్ చూసుకోవడానికి"అని మా బావ కి కాల్ చేసాడు.అలా హైదరాబాద్ చేరాను బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాను,మనసులో బావ నాకేదో జాబ్ చూసి ఉంటాడు వెళ్లి జాయిన్ అవ్వడమే ఇంటర్వ్యూ లేకుండా(మనకి ఇంటర్వ్యు అంటే భయం కదా) అనుకున్నాను..బావ నా స్టేడి డిటైల్స్ అన్ని అడిగి తెల్సుకున్నారు.
ఆ రోజు తను నాకు చెప్పిన మాటలు“నువ్వు ని కెరీర్ ని ఒక గ్రాఫ్ గిసుకో ఎవ్రీ మంత్ ఆ గ్రాఫ్ చూసుకో గ్రౌథ్ లోకి వెళ్తుందా డౌన్ అవుతుందో చూసుకో,డౌన్ అయితే ఎక్కడ ప్రాబ్లం ఉందొ చూసుకో,గ్రౌథ్ లోకి వెళ్తే ఇంకా పయికి రావడానికి ఏమి చేయాలో ఆలోచించు,నేను నీకోసం ఏదో ఒక జాబ్ ట్రై చేస్తా బట్ నీకు నువ్వు ట్రై చేస్తుంటే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి,ఒక జాబ్ చేస్తున్న వాడికి ఆ జాబ్ గురించి మాత్రమె తెలుస్తుంది అదే జాబ్ ట్రయల్స్ వేసే వాడికి అన్ని ఆపర్చునిటీస్ గురించి తెలుస్తుంది”అని చెప్పాడు.అవి ఎంత గొప్ప మాటలో నేను మార్కెట్ లోకి ఎంటర్ అయినా తరువాత తెల్సింది.నేను ఒన్ వీక్ లో ఓన్ గా ఒక చిన్న కంపెనీ లో జాబ్ కొట్టాను,బావ కి కాల్ చేసి చెప్పాను,తను వెంటనే ఏ కంపెని పెద్దదా,చిన్నద అని ఆలోచించకుండా "గ్రేట్ అది ఇది అని నన్ను చాలా ఎంకరేజ్ చేసాడు".అప్పుడు తెల్సింది నాకు ఓన్ గా చిన్నది సాదిన్చినా దాంట్లో ఉండే ఆనందం ఎంతో.
“కోట్ల విలువ చేసే కార్ ల కంటైనేర్ ఒకటి వేరే స్టేట్ నుండి హైదరాబాద్ వెళ్తుంది దాని డ్రైవర్ ఏమి చదువుకొని వాడు(కొత్తగా డ్రైవర్ అయ్యాడు),తనకి హైదరాబాద్ ఏ రూట్ లో వెళ్ళాలో తెలీదు అప్పుడు రోడ్ పక్కన ఉన్న ఒక వ్యక్తి దగ్గర లారి ఆపి సర్ హైదరాబాద్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అని అడిగాడు,అప్పుడు అతను"అలా వెళ్లి రైట్ తిరగు నెక్స్ట్ లెఫ్ట్ తీసుకుని సాయగా వెళ్ళు"అని చెప్పాడు,అతను చెప్పినట్లు ఆ డ్రైవర్ వెళ్లి తన గమ్యాన్ని చేరుకున్నాడు”.ఇక్కడ లారి డ్రైవర్ రూట్ తెల్సిన వాడ్ని రూట్ అడిగాడే కాని అతన్ని కూడా లారి ఎక్కి తన గమ్యం వరకు రమ్మని అడగలేదు,గమ్యం తెల్సుకొని తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు.చాలా మంది కొత్తగా స్టడీస్ కంప్లేట్ చేసి ముందు గా ఆలోచించేది ఇదే నాకు వాళ్ళు తెల్సు వీళ్ళు తెల్సు ఆ కంపెనీ లో చేస్తున్నారు వాళ్ళే నాకు ఏదో ఒక జాబ్ చూస్తారు(ఇంటర్వ్యుస్ లేకుండా)అనే బ్రమ లో ఉండి వాళ్లకి ఉన్న టాలెంట్ ని ఉపయోగించ కుండ వేరే వాళ్ళ మీద ఆధారపడటం లేక ఏదో ఒక బ్యాక్ డోర్ దొరుకుతున్దిలే అనే పిచ్చి ఆలోచనలతో తమ కెరీర్ ని వేస్ట్ చేసుకుంటున్నారు.
”ఒక కుర్రాడు తనకి దొరికిన ఒక పాత పేపర్ ని తనకున్నంత తెలివి తో సొంతం గా ఒక చిన్న గాలిపటాన్ని చేసి ఎగరేసుకోవడానికి సముద్రపు ఒడ్డుకి వచ్చాడు,అప్పుడే కార్ లో ఒక గొప్పింటి అబ్బాయి నాలుగు అయిదు రంగుల గాలిపటాలు పట్టుకుని(షాప్ లో వాళ్ళ నాన్న కొనిచ్చిన)వచ్చి వీడితో "చూసావా నాకు ఎగరేసుకోవడానికి ఎన్ని గాలిపటాలున్నాయో అన్నాడు(బడాయి గా),వెంటనే వీడు "చూసావా నా గాలిపటం ఎగరేసుకోవడానికి ఎంత పెద్ద ఆకాశం ఉందో,అని ఆకాశం వయిపు పయి పయికి ఎగురుతున్న తన గాలి పటాన్ని చూపిస్తూ అన్నాడు”.అలా పాజిటివ్ గా ఆలోచిస్తే దొరకిన ప్రతి చిన్న అవకాశం మన భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది అని ఆసిస్తూ……………………………….





Your’s…………………………..సతీష్. 

Sunday, May 9, 2010

అందని అమ్మ ప్రేమ

అందరు పుట్టిన వెంటనే ఏడుస్తారు నవ్వకుండా ఎందుకో తెల్సా "ఒక అద్బుతమయిన శక్తి నుండి మనల్ని ఎవరో దూరం చేస్తున్నారని భయం తో"ఆ అద్బుత శక్తి పేరే అమ్మ.9 నెలలు ఆ శక్తితో పెనవేసుకుని ఉన్న మన పేగు బందాన్ని ఎవరో దూరం చేస్తున్నారు అనే బాధ మనల్ని ఉగ్గపెట్టుకుని ఏడ్చేలా చేస్తుంది.మన మాటలను,అభిప్రాయాలను తెల్సుకుని మనకు ఫ్రెండ్స్ దగ్గరవుతారు,మన స్టేటస్ చూసి మనకు పార్ట్నేర్స్ ఉంటారు.కాని అస్సలు మనమేమి అవుతామో మనకి ఏ పోసిషన్ వస్తుందో కూడా తెలియని వయసునుండే మన నుంచి ఏమి ఆశించకుండా మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఒక అద్బుతమయిన శక్తి అమ్మ.
ఎవరికి తమ దగ్గరగా ఉన్నప్పుడు గొప్ప వాటి విలువ తెలియదు,అవి మనకు దూరం అయినప్పుడు వాటి విలువ మనకు తెలుస్తుంది.నేను చిన్నప్పుడు అల్లరి చేస్తున్నప్పుడు,స్కూల్ కి వెళ్ళను అని మారాం చేస్తున్నప్పుడు అమ్మ కొడుతూ ఉండేది(ఆ దెబ్బలు నా భవిష్యతు ని చూపే మార్గాలు అని అప్పుడు తెలియదు),అప్పుడు నేను అమ్మకు దూరం గా ఉండాలి అనుకునే వాడ్ని కాని ఇప్పుడు తెలుస్తుంది ఒక్కసారి అమ్మకు దూరం అయిన నాకు లైఫ్ లో ఇంకెప్పుడు ఆ ప్రేమకు దగ్గర అవ్వలేను అని.ఎవరు మన మీద ప్రేమ చూపించినా ఏదో ఒకటి ఆశించి మాత్రమె ప్రేమను చూపిస్తారు,అమ్మ ఒక్కతే  మనగురించి మాత్రమె ఆలోచించి ప్రేమను పంచుతుంది.నిజం గా అమ్మ కు దూరం గా బ్రతికే వాళ్ళు ఈ ప్రపంచం లో  కెల్లా పెద్ద దురదృష్టవంతులు.
మనకి ఈ రోజు ఎంతో ఆనందం కల్గినా బాద కల్గినా  ఇంటికి వచ్చి వెంటనే అమ్మ తో చెప్పాలి అనుకుంటాం కాని చెప్పుకోవడానికి అమ్మ లేదు.కొంత మందికి అమ్మ ప్రేమ ఎంత దగ్గర గా ఉన్నా పట్టిచ్చుకోరు,ఎంతోమంది అనాదలు అబాగ్యులు అమ్మ ప్రేమకు దూరమయి అనాధ ఆశ్రమాలలో రోజు అమ్మ ప్రేమ కోసం తపిస్తున్నారో.అమ్మ ప్రేమ కు దూరమయిన వాళ్లకి “మనల్ని మనకంటే ప్రేమ గా బాద్యత గా చూసే ప్రతి ఒక్కరు అమ్మ తో సమానమే” అని నా ఫీలింగ్.అన్నీఉన్నా మనమే ఏదో ఒక సమయం లో ఏదో కోల్పోయాం అని ఫీల్ అవుతాం,అలాంటిది ఏ ప్రేమ లు ఏ బందాలు లేని అనాధలు వాళ్ళ పరిస్తితి ఏంటి.వాళ్ళను వోదార్చే వారెవరు.మనం కొద్ది గా మన ప్రేమను వాళ్లకి పంచితే చాలు వాళ్ళు మనలో అమ్మ ప్రేమ ను చూసుకుంటారు.ఈ ప్రపంచం లో విలువ కట్టలేనిదేదన్న ఉంది అంటే అది అమ్మ ప్రేమ ఒక్కటే.ఆ ప్రేమను మనం వేరే వాళ్లకు పంచుతున్నాం అంటే అంతకన్నా గొప్ప విషయం మన జీవితం లో ఇంకేముంటుంది.మన ఈ జీవితం లో ప్రతి రోజు అమ్మ పెట్టిన బిక్షే తనని ఏదో ఒక్కరోజు తలచుకొని మిగిలిన రోజులు మర్చిపోవద్దు.

మనకి దొరికినంత సమయం లో తోచినంత ప్రేమను అమ్మ ప్రేమ కు దూరమయి ఎంతో బాదపడుతున్న అభాగ్యులకు పంచుతూ మనం కోల్పోయిన ప్రేమను వాళ్లకు అందిద్దామని ఆసిస్తూ…………………….


Your 's ..........................................సతీష్ .

Saturday, May 8, 2010

అంతం లేని యుద్ధం


17 నెలల  నిరీక్షణ(ఇది మన దేశ ప్రగతికోసం చేపట్టిన ప్రాజెక్ట్ టార్గెట్ కాదు),35 కోట్ల ఖర్చు(ఇదేమి మన దేశ భవిష్యతుకోసం కేటాయించిన బడ్జెట్ అంతకన్నా కాదు).26/11 ఈ డేట్ మన దేశం గురించి కొద్దిగా ఆలోచించే ప్రతి ఒక్కరికి ఎప్పటికి గుర్తుండిపోయే విషాదమయిన రోజు(ముంబైలో జరిగిన మారణకాండ,166 మంది మరణం).సచిన్ టెండూల్కర్ ముంబై నుండి తన పేరుని ప్రపంచం అంత చాటటానికి 17 సంవత్సరాలు పడితే,అజ్మల్ అమీర్ కసాబ్ ఈ పేరు ప్రపంచం అంతా వ్యాపించడానికి పట్టిన సమయం 17 నెలలు మాత్రమె.ముంబై లో మారణకాండ జరిగిన సాయంత్రానికే కసాబ్ ని అందరం TV లో ఫోటోల తో సహా చూసాం T షర్టు&కార్గో ప్యాంటు,వెనక ఒక బాగ్,చేతిలో పెద్ద గన్,కొద్దిలో కొద్దిగా టేరోరిస్ట్ అంటే ఏంటి అని తెల్సిన ప్రతి  వాడికి కసాబ్ ఒక పెద్ద టేరోరిస్ట్ అని ఆ రోజే తెల్సింది,కాని దాన్ని ప్రూవ్ చేయడానికి మన ప్రభుత్వానికి 17 నెలల సమయం,35 కోట్ల ఖర్చు అయిన తరువాత తెల్సింది.
మన రాజ్యాంగం ప్రకారం “వంద మంది దోషులు తప్పిచ్చుకున్నా పర్వాలేదు కాని ఒక నిర్దోషికి సిక్షపదకూడదు” ఇది మంచిపద్దతే,కాని కసాబ్ ఏమి ఆరోపణలు ఎదుర్కుంటున్న ఖైది కాదు.ఫోటోలు,వీడియోలు,ప్రత్యేక సాక్షులు చూస్తుండగా 52 మంది అమాయకులను దారుణం గా చంపిన మృగం,క్రూర మృగం కూడా తన ఆకలి తీరగానే వేట ని మానేస్తుంది కాని ఒకటి కాదు రెండు కాదు 52 మంది ప్రాణాలను తీసిన అలాంటి మానవ మృగాన్ని శిక్షించడం కోసం ఇంత ఖర్చు ఇంత సమయం  వృధా చేయడం అవసరమా…?కసాబ్ కెమెరాలకు రెడ్ హన్దేడ్ గా చిక్కాడు కాబట్టి ఈ మాత్రం సమయం అన్న తీసుకున్నారు,అదే ఈ సాక్షాలు కూడా లేకపోతె కసాబ్ అమాయకుడు అనే తీర్పు మన మనవళ్ళు వినాల్సి వచ్చేదేమో.నాలాంటి సామాన్యుడు తెలియక “కసాబ్ ని ఎందుకు ఇన్నిరోజులు శిక్షించకుండా ఉంచారు అని అడిగితె”మన మేధావులు(అదేనండి మన ప్రభుత్వం)చెప్పేదేంటంటే“ప్రపంచ దేశాలముందు పాకిస్తాన్ ని దోషిగా నిలపెట్టడానికి ఈ కేస్ ని ఉపయోగిస్తున్నాం అని”.26/11 దాడికి ప్రత్యక్షం గా పరోక్షం గా ఎవరు కారణమో వోటు హక్కు వచ్చిన ప్రతి వాడికి తెల్సు(ప్రపంచ దేశాలకు తెలీదా?).ఈ తీర్పు తరువాత పాకిస్తాన్ కి వచ్చిన నష్టమేంటి ఇండియా కి వచ్చిన  లాబమేంటి…?ఈ 17 నెలల్లో ఉగ్రవాదులు ఇంకో దాడికి ప్లాన్ చేసి ఉంటారు తప్ప,మనం వాళ్ళమీద సాదిన్చిన్దేమి లేదు.సాక్షాల తో ఉగ్రవాది గా నిరుపించబడ్డ అఫ్జల్ గురు ని అయిదు సంవత్సరాలు గా ఊరి తీయలేక పోతున్నాం,మరి కసాబ్ ని ఏమి చేస్తారో అది మన ప్రజా ప్రతినిధులకే తెలియాలి.ఇది ఒక అఫ్జల్ తోనో కసాబ్ తోనో అంతమయ్యే యుద్ధం కాదు.
మానవ సంగాలు అంటే అర్ధం ఏంటో ఇప్పటి వరకు నాకు అర్ధం కాదు.కసాబ్ ని ఊరి తీయొద్దు క్షమాబిక్ష పెట్టండి అని అప్పుడే వాళ్ళ వోవర్ యాక్షన్ స్టార్ట్,అస్సలు వీళ్ళు పబ్లిక్ స్టంట్ కోసం ఇవన్ని చేస్తారో, నిజం గా వీళ్ళకి మనుషుల మీద ప్రేమతో చేస్తారో.ప్రేమనేదే ఉంటె 26/11 రోజు చనిపొఇన 166 మంది మానవులు కాదా.వాళ్ళగురించి ఏ మానవహక్కుల వాళ్ళు మాట్లాడరే?.విజయవాడ మనోహర్(శ్రీ లక్ష్మి హత్య)ని ఊరి  తీయండి,వరంగల్ ఆ ఇద్దర్ని(యాసిడ్ దాడిలో పాల్గొన్న)చంపడం న్యాయమే అని స్పీచ్లు ఇచ్చే ఈ సంగాలకు కసాబ్ కి  మాత్రం క్షమాబిక్ష పెట్టండి,పార్లమెంట్ మీద దాడి చేసిన అఫ్జల్ గురు ని వదిలేయండి అని అడగటానికి నోరు ఎలా వస్తుందో అర్ధం కావట్లేదు.మనల్ని కుట్టడానికి వస్తున్న చిన్న చీమనే వదలకుండా వెంటాడి చంపుతామే అలాంటిది మన భారతమాత గుండెల మీద తన్నడానికి వచ్చిన వాడ్ని ఇన్ని రోజులు మన దేశ బద్రతలమద్య దాయటమే తప్పు.
ఉజ్వల్ నిఖం ఈ కేసు ని ఎంతో ధైర్యం గా దేశం తరుపున వాదించి గెల్చిన లాయెర్,ML.తహిల్వని ధైర్యం గా ఈ తీర్పుని ఇచ్చిన న్యాయమూర్తి.వీళ్ళకి మనం ఎంతో రుణపడి ఉన్నాం.కసాబ్ కి పడ్డ ఈ శిక్ష ఉగ్రవాదుల గుండెల్లో భయానికి నాంది పలకాలని,ఈ శిక్ష తో ఆ దాడిలో చనిపోయిన 166 మంది ఆత్మ శాంతించాలని  కోరుకుంటూ.దాడిలో చనిపోయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నివాళులు అర్పిస్తూ…………

"ఈ తీర్పు ఉగ్రవాదం మీద ఆరంబమే కాని అంతం కాకూడదు అని ఆసిస్తూ..........."
Your’s…………………సతీష్