Pages

Saturday, May 8, 2010

అంతం లేని యుద్ధం


17 నెలల  నిరీక్షణ(ఇది మన దేశ ప్రగతికోసం చేపట్టిన ప్రాజెక్ట్ టార్గెట్ కాదు),35 కోట్ల ఖర్చు(ఇదేమి మన దేశ భవిష్యతుకోసం కేటాయించిన బడ్జెట్ అంతకన్నా కాదు).26/11 ఈ డేట్ మన దేశం గురించి కొద్దిగా ఆలోచించే ప్రతి ఒక్కరికి ఎప్పటికి గుర్తుండిపోయే విషాదమయిన రోజు(ముంబైలో జరిగిన మారణకాండ,166 మంది మరణం).సచిన్ టెండూల్కర్ ముంబై నుండి తన పేరుని ప్రపంచం అంత చాటటానికి 17 సంవత్సరాలు పడితే,అజ్మల్ అమీర్ కసాబ్ ఈ పేరు ప్రపంచం అంతా వ్యాపించడానికి పట్టిన సమయం 17 నెలలు మాత్రమె.ముంబై లో మారణకాండ జరిగిన సాయంత్రానికే కసాబ్ ని అందరం TV లో ఫోటోల తో సహా చూసాం T షర్టు&కార్గో ప్యాంటు,వెనక ఒక బాగ్,చేతిలో పెద్ద గన్,కొద్దిలో కొద్దిగా టేరోరిస్ట్ అంటే ఏంటి అని తెల్సిన ప్రతి  వాడికి కసాబ్ ఒక పెద్ద టేరోరిస్ట్ అని ఆ రోజే తెల్సింది,కాని దాన్ని ప్రూవ్ చేయడానికి మన ప్రభుత్వానికి 17 నెలల సమయం,35 కోట్ల ఖర్చు అయిన తరువాత తెల్సింది.
మన రాజ్యాంగం ప్రకారం “వంద మంది దోషులు తప్పిచ్చుకున్నా పర్వాలేదు కాని ఒక నిర్దోషికి సిక్షపదకూడదు” ఇది మంచిపద్దతే,కాని కసాబ్ ఏమి ఆరోపణలు ఎదుర్కుంటున్న ఖైది కాదు.ఫోటోలు,వీడియోలు,ప్రత్యేక సాక్షులు చూస్తుండగా 52 మంది అమాయకులను దారుణం గా చంపిన మృగం,క్రూర మృగం కూడా తన ఆకలి తీరగానే వేట ని మానేస్తుంది కాని ఒకటి కాదు రెండు కాదు 52 మంది ప్రాణాలను తీసిన అలాంటి మానవ మృగాన్ని శిక్షించడం కోసం ఇంత ఖర్చు ఇంత సమయం  వృధా చేయడం అవసరమా…?కసాబ్ కెమెరాలకు రెడ్ హన్దేడ్ గా చిక్కాడు కాబట్టి ఈ మాత్రం సమయం అన్న తీసుకున్నారు,అదే ఈ సాక్షాలు కూడా లేకపోతె కసాబ్ అమాయకుడు అనే తీర్పు మన మనవళ్ళు వినాల్సి వచ్చేదేమో.నాలాంటి సామాన్యుడు తెలియక “కసాబ్ ని ఎందుకు ఇన్నిరోజులు శిక్షించకుండా ఉంచారు అని అడిగితె”మన మేధావులు(అదేనండి మన ప్రభుత్వం)చెప్పేదేంటంటే“ప్రపంచ దేశాలముందు పాకిస్తాన్ ని దోషిగా నిలపెట్టడానికి ఈ కేస్ ని ఉపయోగిస్తున్నాం అని”.26/11 దాడికి ప్రత్యక్షం గా పరోక్షం గా ఎవరు కారణమో వోటు హక్కు వచ్చిన ప్రతి వాడికి తెల్సు(ప్రపంచ దేశాలకు తెలీదా?).ఈ తీర్పు తరువాత పాకిస్తాన్ కి వచ్చిన నష్టమేంటి ఇండియా కి వచ్చిన  లాబమేంటి…?ఈ 17 నెలల్లో ఉగ్రవాదులు ఇంకో దాడికి ప్లాన్ చేసి ఉంటారు తప్ప,మనం వాళ్ళమీద సాదిన్చిన్దేమి లేదు.సాక్షాల తో ఉగ్రవాది గా నిరుపించబడ్డ అఫ్జల్ గురు ని అయిదు సంవత్సరాలు గా ఊరి తీయలేక పోతున్నాం,మరి కసాబ్ ని ఏమి చేస్తారో అది మన ప్రజా ప్రతినిధులకే తెలియాలి.ఇది ఒక అఫ్జల్ తోనో కసాబ్ తోనో అంతమయ్యే యుద్ధం కాదు.
మానవ సంగాలు అంటే అర్ధం ఏంటో ఇప్పటి వరకు నాకు అర్ధం కాదు.కసాబ్ ని ఊరి తీయొద్దు క్షమాబిక్ష పెట్టండి అని అప్పుడే వాళ్ళ వోవర్ యాక్షన్ స్టార్ట్,అస్సలు వీళ్ళు పబ్లిక్ స్టంట్ కోసం ఇవన్ని చేస్తారో, నిజం గా వీళ్ళకి మనుషుల మీద ప్రేమతో చేస్తారో.ప్రేమనేదే ఉంటె 26/11 రోజు చనిపొఇన 166 మంది మానవులు కాదా.వాళ్ళగురించి ఏ మానవహక్కుల వాళ్ళు మాట్లాడరే?.విజయవాడ మనోహర్(శ్రీ లక్ష్మి హత్య)ని ఊరి  తీయండి,వరంగల్ ఆ ఇద్దర్ని(యాసిడ్ దాడిలో పాల్గొన్న)చంపడం న్యాయమే అని స్పీచ్లు ఇచ్చే ఈ సంగాలకు కసాబ్ కి  మాత్రం క్షమాబిక్ష పెట్టండి,పార్లమెంట్ మీద దాడి చేసిన అఫ్జల్ గురు ని వదిలేయండి అని అడగటానికి నోరు ఎలా వస్తుందో అర్ధం కావట్లేదు.మనల్ని కుట్టడానికి వస్తున్న చిన్న చీమనే వదలకుండా వెంటాడి చంపుతామే అలాంటిది మన భారతమాత గుండెల మీద తన్నడానికి వచ్చిన వాడ్ని ఇన్ని రోజులు మన దేశ బద్రతలమద్య దాయటమే తప్పు.
ఉజ్వల్ నిఖం ఈ కేసు ని ఎంతో ధైర్యం గా దేశం తరుపున వాదించి గెల్చిన లాయెర్,ML.తహిల్వని ధైర్యం గా ఈ తీర్పుని ఇచ్చిన న్యాయమూర్తి.వీళ్ళకి మనం ఎంతో రుణపడి ఉన్నాం.కసాబ్ కి పడ్డ ఈ శిక్ష ఉగ్రవాదుల గుండెల్లో భయానికి నాంది పలకాలని,ఈ శిక్ష తో ఆ దాడిలో చనిపోయిన 166 మంది ఆత్మ శాంతించాలని  కోరుకుంటూ.దాడిలో చనిపోయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నివాళులు అర్పిస్తూ…………

"ఈ తీర్పు ఉగ్రవాదం మీద ఆరంబమే కాని అంతం కాకూడదు అని ఆసిస్తూ..........."
Your’s…………………సతీష్

3 comments:

  1. oh..naa blog chooara aunty ani adigav ninna..choodakapoinanduku chala miss ayyanu ..inthati writer va nuvvu?..great!!!!!..really u r great.. ika nee gurinchi koncham deep ga vellalsinde :). nee studies annee ekkada chesavu?..Gundala lone chadivava primary antha..?

    ReplyDelete
  2. abbo!! politics bagane vanta batinchikuntannavu..anvy hat's of u..nee opika ki mechukovali :)

    ReplyDelete