Pages

Wednesday, September 29, 2010

ఈనాడు వార్త కి ఆంధ్రజ్యోతి సాక్షి

టైం ఉదయం ఆరు అవుతుంది అప్పుడే లేచి హాల్ లోకి వస్తున్న నాకు ఇంట్లో ఏదో గొడవ అవుతున్న గోల వినిపిస్తుంది.ఇంత పొద్దున్నే ఎవరబ్బా అని కాస్త కంగారుగా హాల్ లోకి వెళ్లి చూస్తే, ఇంకెవరు మన టీవీ న్యూస్ చానెల్ వాళ్ళు. పని పాట లేని వో నలుగురు నాయకులు వాళ్లకి తోడు నారద ముని లాంటి(ఆ నారద ముని లోక కళ్యాణం కోసం చేస్తే వీలు మాత్రం TRP రేటింగ్స్ కోసం) ఒక యాంకర్ కల్సి కొద్దిగా కూడా ఉపయోగం లేని ఒక మేటర్ గురించి చర్చా కార్యక్రమం అంట. దాన్ని చర్చ అనడం కన్నాపనీ పాట లేని ఉప్పర మీటింగ్ అనడం కరక్టేమూ.
సరేలే అని వేరే చానెల్ మారిస్తే అక్కడ ఇదే తంతు బట్ కారక్టేర్స్ డిఫరెంట్ అనమాట.పొద్దున్నే కాకి గోల తప్ప ఆ గొడవలో లాస్ట్ కి వీళ్ళు ఏమి చెప్పదలుచుకున్నారో చెప్పేలోపే మన TV యాంకర్ గారు టైం అయిపాయింది చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు చూస్తూనే ఉండండి నిరంతరవాని మా చావుకి భాని అన్నట్లు చర్చకి వచ్చిన నాయకులని బఫ్ఫూన్ ల లా వదిలేసి ఒక యాడ్ వేసుకుంటారు, అయినా మన నాయకులు సిగ్గు ఎగ్గు లేదు అన్నట్లు పిలిచినోడే పాపం అన్నట్లు మళ్లీ వేరే చానెల్ వాడు పిలిస్తే మళ్లీ ఉరుకుతారు.

మన నాయకులే కరెక్టుగా ఉంటె ఈ గోలంతా TV వాల్లకెందుకు ఈ చావు గోల పొద్దు పొద్దున్నే మన ఇళ్ళల్లో ఎందుకు చెప్పండి. ఒకప్పుడు ఇన్-డైరక్టుగా నాయకుల పేర్లు చెప్పి కార్టూన్ బొమ్మల ద్వారా కామెంట్ చేసే TV వాళ్ళు ఇప్పుడు నాయకుల పేర్లు డైరెక్ట్ గా పెట్టి వారి ఫేస్లను మాస్క్ ల లా ధరించి డైరెక్ట్ గా ఒకర్ని ఒకళ్ళు మామూలు బాషలో కాకుండా చెవులకు చిల్లులు పడే బూతులలో తిట్టుకునే ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఏ నాయకుడు ధైర్యంగా ముందుకొచ్చి ప్రశ్నించే హక్కు లేక "ఎవడిగోల వాడిది" అని వదిలేస్తున్నారంటే వీళ్ళెంత నీతిమంతులో అర్ధమవుతుంది మనకు.ప్రతి పార్టీ ఒక న్యూస్ చానెల్ పెట్టుకోవడం,ఒక పది మందితో ఎదుటి పార్టీలను తిట్టించడం చూస్తుంటే భావితరాల వారిని పోలిటిక్స్ నేర్చుకోవడానికి కాలేజెస్ కి పంపకుండా TV ల ముందు కుర్చోపెడితే చాలేమో అనిపిస్తుంది.

అయోధ్య తీర్పుని నాలుగు అయదు రెచ్చకొట్టే క్లిప్పింగ్స్,రెచ్చకొట్టే సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ లో వేసి ఒక గంట ప్రోగ్రాం పెట్టి అమాయక జనాలను రెచ్చకోట్టడం, డ్రగ్స్ మాఫియా అని ఒక న్యూస్ స్టార్ట్ చేయడం మా దగ్గర అందరి లిస్టు ఉంది అని బ్లాకు మెయిల్ చేయడం డబ్బులు దొబ్బడం లాస్ట్ కి జనాల్ని పిచ్చి వాళ్ళని చేయడం(ఆ లిస్టు లో ఉన్న పెద్ద వాళ్ళ పేర్లను ఫస్ట్ లోనే బయట పెట్టొచ్చుగా),ఒక అమ్మాయి మీద దాడి జరిగితే ఆ అబ్బైని పెద్ద స్టార్ ని చేయడం తరువాత కాం అవడం,ఏ TV వాడు వాళ్ళ నాయకుడి వివరాలు తప్ప సమాజం లో ఏమి అన్యాయం జరిగినా మనకి అనవసరం అనుకోవడం,తెలంగాణా లో విద్యార్దులను ఇక్కడ, ఆంధ్రాలో విద్యార్దులను అక్కడ రెచ్చ కొట్టి న్యూస్ క్రియేట్ చేసుకోవడం,అవసరమయితే హత్యను ఆత్మ హత్య గా,ఆత్మ హత్యను హత్యగా క్రియేట్ చేయగలడం,ధనం తప్ప జనం గురించి ఆలోచించకపోవడం.ఇలాంటి ఎన్నో అర్హతలు ఉంటేనే ఈ కాలం లో పోటీని తట్టుకుని TRP రేటింగ్స్ తెచ్చుకోగలరు.

200 సంవత్సరాలు మనల్ని పరిపాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీ కి ఇప్పుడు CEO ఒక ఇండియన్ అయ్యాడు,30 సంవత్సరాల వయసు ఉన్న ప్రణవ్ అనే వ్యక్తి మన బాడీ నే కంప్యూటర్ గా డిజైన్ చేసాడు,ఇలాంటివి మన ఛానల్ వాలకి న్యూస్ ల కనిపిచదేమో,కనీసం మన దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల చరిత్ర గురించి చూపిచ్చే టైం మాత్రం మన న్యూస్ చానెల్స్ కి, పేపర్స్ కి ఉండదు కాని,రాంగోపాల్ వర్మ కి విజయవాడ లో ఉన్న ఒక నాయకుడికి మద్య గొడవ లేపడం దాన్ని 24/7 చుపిచడానికి మాత్రం విసుగురాదు. ప్రతీ న్యూస్ చానెల్ ప్రజల సమస్యలను చూపిచ్చి కాష్ చేసుకుంటుంది కాని ఏ ఒక్క న్యూస్ చానెల్ ప్రజల సమస్యతీరే వరకు వారికి తోడుగా నిలవడం లేదు అన్నది జగమెరిగిన సత్యం.



మీడియా నే మన సమాజానికి నాలుగో పాదం అంటారు,నాలుగో పాదం లెకపొఇన మనం కుంటుకుంటూ గడపగలం కాని ఆ నాలుగో పాదమే మిగిలిన మూడు పాదాలను నాశనం చేస్తుంటే ఎలా.రోజు TV లో ఆ చర్చ గోష్టి చూసి బోర్ కొట్టి నేను నా ఆవేదనను రాయట్లేదు,మన సమాజానికి సమాజం లో ఉండే వ్యక్తులకి అవి ఎంత చేటు చేస్తున్నాయో ప్రత్యక్షంగా చూసి బాధపడుతూ రాస్తున్నాను, పార్టీల వారి మద్య తగాదాలు పెట్టి ఆయా పార్టీలను అభిమానించే సామాన్యుల మీద ఈ ప్రభావం పడి వారు మానవత సంబందాలు మానేసి ఏదో సొంత కక్షలులా వారి మనస్సులో పాతుకుపోయేలా ప్రేరేపిస్తున్నారని నా అభిప్రాయం, ఎలాగు మన నాయకులు,వారి న్యూస్ చానెల్లు మారే ఛాన్స్ లేదు కాని దయచేసి అదీ చూసి మనం మాత్రం మారవద్దు అని ఆసిస్తూ………










Your’s…………………………………….సతీష్.                                                               

Tuesday, September 7, 2010

మొక్కయి వంగనిది మానయి వంగునా...?

యువత ఈ మాట వినగానే 16 సంవత్సరాల వాడి దగ్గరి నుండి 30 సంవత్సరాల వాడి వరకు ఉప్పొంగిపోతాడు నేను యూత్ అని ఫీల్ అవుతూ.ఒక సినిమాలో అన్నట్లు నువ్వు యూత్ ఎంట్రా అని. నిజమే యువత అంటే 18 నుండి 25 yrs వాళ్ళు మాత్రమె అని అర్ధం కాదు, 90 సంవత్సరాల వయసులో కూడా యూత్ ఉన్నారని నేను నమ్ముతా.యూత్ అంటే ఉరకలేసే ఉత్సాహం ఏదన్నా సాదించాలనే కసి,దానికోసం ఎంతయినా కష్టపడే ధైర్యం ఉన్న ప్రతి ఒక్కడు యువత కిందకే వస్తారు వయసుతో సంబంధం లేకుండా.మన దేశ భవిష్యత్తు మన యువత మీద ఆదారపడి ఉంది అంటుంటారు కదా…!
బద్ధకం అనే దెయ్యం పట్టుకుని పీడిస్తున్న ఈ యువత(అదేనండి మనం ఫీల్ అవుతున్న ఈ యూత్) వల్ల దేశ భవిష్యత్తు ఏమవుతుందో……?
 
నేను కూడా మనం ఫీల్ అయ్యే యూత్ లోకి వస్తున్న కొద్ది సేపు…. ఒకప్పుడు యూత్ అంటే 18 to 25yrs. ఈ ఏజ్ లోనే కొంటె పనులు, చిలిపి పనులు చిన్న చిన్న తప్పులు చేస్తాం. కాని మన యూత్ ఏజ్ ఇప్పుడు జెనరేషన్ లో 12 to 13yrs నుండే స్టార్ట్ అవుతుంది అంటే  మనం ఎంత ఎదిగిపోయామో కదా.12 , 13 సంవత్సరాల నుండే మందు,సిగరెట్ తాగే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అంటే మనం యూత్ ఏజ్ ని అప్పుడే స్టార్ట్ చేసామన్నమాట.ఇంటర్మీడియట్ వయసులోనే మన యూత్ లో 70% ఉహించనంత  బయంకరమయిన అలవాట్లకు బానిసలవుతున్నారు అంటే కాదని అనగలరా….? ఇది సిగరెట్ పెట్ట మీద రాసిన "smoking is injurious to health " అన్నంత నిజం.అంటే మన భవిష్యత్తు యువత చేతిలో ఉంది అని భవిష్యత్తు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, మన యువత ఇప్పుడే మన దేశ చరిత్రను,సంస్కృతి ని మార్చేస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటె మనకు మార్పు అంటే ఇష్టం కదా…….!
 
ఒక చిన్న మొక్క రోడ్ పక్కన ఉంది,ఒక రోజు పెద్ద వర్షం వచ్చి దానికింద కొంచెం మట్టి కొట్టుకుపోయింది,అది బాలన్స్ అవుట్ అయి కొద్దిగా వంగింది.అలా అలా అది వంకరగా పెరుగుతూ వచ్చింది, అప్పుడు దాన్ని ఎవరు పట్టిచ్చుకోలే అలా అలా పెరుగుతూ పెద్దదయింది.చిన్నప్పట్నుండి కాస్త వంకరగా పెరగటం వల్ల అది వంగి రోడ్ కి అడ్డంగా రావడం మొదలు పెట్టింది,దాని వల్ల రోడ్ మీద వెళ్ళే వాహనాలకు ఆటంకం గా తయారయింది.ఇప్పుడు దాన్ని పక్కకు వంచుదామన్న కుదిరే పని కాదు అని తెల్సి R&B వాళ్ళు దాన్ని నరికి పడేసారు.ఇక్కడ చిన్న మొక్క అనేది మన యూత్,వర్షం అనేది యూత్ లైఫ్ లో మనకు ఎదురయ్యే సంగటనలు. రోడ్ అనేది సమాజం,వాహనాలు సమాజం లోని వ్యక్తులు. ఇలా ఆ మొక్కని మొక్కగా ఉండగానే సరిగా పెంచకపోవడం వల్ల మానుగా మారి దాని జీవనం సమాజం లో ఉన్న అందరికి ఆటంకంగా తయారయింది.
 
యూత్ ఎవరన్న ఏదన్నా మంచి విషయాలు చెప్తే తొక్కలో సోది ఈ వయసులో కాకపొతే ఏ వయసులో ఎంజాయ్ చేస్తాం అని ఫీల్ అవుతాం. అస్సలు ఎంజాయ్ అంటే ఏంటి…….? మన వలన ఎదుటి వాడు బాధ పడకుండా మనం హ్యాపీ గా ఉంటూ మన చుట్టూ ఉండే వాళ్ళని హ్యాపీ గా ఉంచడమే.ఎంతమంది కనీస బాద్యత లేకుండా ఇంట్లోవాళ్ళని బాధపెడుతూ, క్రమశిక్షణ లేకుండా గురువులను బాధపెడుతూ, పయిసాచకం గా తోటి వారిని హింసిస్తూ,ఇలా ఎంజాయ్ అనే ముసుగులో కొట్టుకుంటూ బ్రతికేస్తున్నారు.నిజమే ఇందులో వారి తప్పేమీ లేదు మొక్కని మనం చిన్నపుడు వంచకపోతే అది అలానే పెరుగుతుంది అందుకు ఆ తప్పు మొక్కది కాదు దాన్ని వంచని ఈ వ్యవస్తది.
 
మన ఈ ప్రభుత్వాలు ఏడాదికి వంద రెండొందల కాలేజీ లు పెంచుతూ ఏదో మన యువతకు ఉపాది కల్పిస్తున్నాం అని ఫీల్ అవుతూ కార్పోరేట్ సమత్సలకు మన సొమ్మును మన భవిష్యత్తును అమ్ముకుంటున్నారు.ఎన్ని కాలేజీ లు ఉన్నాయన్నది కాదన్నయ్యా ఏమి చెప్తున్నారన్నదే ముక్యం…..(మహేష్ బాబు అన్నట్లు).ఉన్న కాలేజీ లలోనే మన చదువులు మన మనుగడకి,మన భవిష్యత్తుకి,క్రమశిక్షనకి ఉపయోగ పడుతున్నాయా లేదా అని ఆలోచించడం లేదు.వెలుగుతున్న అగ్గిపుల్లని ఆర్పడానికి కనీసం చుక్క నీరు కూడా అవసరం లేదు,చేత్తో అర్పెయోచ్చు. అదే నిప్పును మనం పట్టిచుకోవడం మానేస్తే దాన్ని ఆర్పడానికి కొన్ని ఫైర్ ఇంజన్ లు వచ్చినా సరిపోదు.అంటే మన యూత్ నడిచే దారిని ఇప్పుడే మనం బాగుచేయకపోతే దాని వల్ల జరిగే ఈ విష పరిణామాలను ఆపడం అది ఎవరి తరం కాదు అని నా అభిప్రాయం.ప్రభుత్వాలు కనీసం ఇండియా లో ఉన్న ఒక్క బాచ్ ని అన్నా 10th క్లాసు నుండి డిగ్రీ అయ్యే వరకు జాగర్త గా అన్నీ విలువలతో క్రమసిక్షనగా బయటికి వచ్చేలా చేస్తే మన దేశం 100 సంవత్సరాల ముందుకి వెళ్తుంది అని నా అభిప్రాయం……..   
 
 
 
యువర్'s.................................సతీష్.