Pages

Saturday, June 19, 2010

తెలుగు జాతి మనది...నిండుగ వెలుగు జాతి మనది



హైదరాబాద్ అసెంబ్లీ దగ్గర గొడవ జరుగుతుంది మేటర్ ఏంటంటే తెలంగాణా వాళ్ళు ఆంధ్ర వాళ్ళు సెపరేట్ కావాలి అని కొట్టుకుంటున్నారు, ఈ లోపు ఇద్దరి నాయకులు(ఒకడు from తెలంగాణా,ఇంకొకడు from ఆంధ్ర) అలిసిపొఇ రోడ్ పక్కనే ఉన్నఒక చిన్నషాప్ దగ్గర(షాప్ వాడు తెలంగాణానో ఆంధ్రనో తెలీదు) కుర్చుని డ్రింక్ తాగుతున్నారు.ఇంతలో షాప్ వాడు పేపర్ చదువుతున్నాడు పైకి వినపడేలా "Australia లో తెలుగు విద్యర్డులపయిన దాడి"అని,వెంటనే ఇద్దరి నాయకుల్లో ఒక నాయకుడి కొడుకు Australia లో చదువుతున్నాడు,వాడికి ఫోన్ చేసి యోగ క్షేమాలు కనుక్కుని జాగర్త నాన్న అని చెప్పి ఫోన్ పెట్టాసాడు,ఇంతలో ఇంకో నాయకుడు పర్లేదా మీ వాడు సేఫ్ కదా అన్నాడు k అన్నాడు,ఏంటండి ఇంత దారుణం మనవాల్లేదో చదువుకున్దాము అని అంత దూరం వెళ్తే వాళ్లకు ఏమయింది ఇలా చేస్తున్నారు అన్నాడు ఒక నాయకుడు,ఇంకో నాయకుడు అవునండి మన ప్రబుత్వం కూడా పట్టించుకోవట్లేదు దారుణం అన్నాడు, వెంటనే షాప్ వాడు "ఏదండి దారుణం



ఎక్కడో Australia అది మన దేశం కాదు మన బాష అంతకన్న్నకాదు,అక్కడి మేటర్ పక్కన పెడితే మన కళ్ళ ముందు మీరు చేస్తున్దేంటి,మనందరం తెలుగు వాళ్ళం,ఇందులోనే మా ఏరియా కి నువ్వు రాకు అంటే మా ఏరియా కి నువ్వు రాకు అని తలలు పగల కొట్టుకు చస్తున్నాము,ఒకే బాష ఒకే రాష్ట్రం ఒకే దేశం వాళ్ళం మనమే ఇలా ఉంటె,ఎవడో వేరే దేశం వాడు మన వాళ్ళను కొట్టడం లో వింత ఏముంది సర్" అన గానే ఇద్దరి నాయకులు ఒకరి పేస్ లోకి ఇంకొకరు తెల్ల మొహమేసి చూసుకుని ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోయారు మెల్లగా….

ఇది నిజమే కదా,మన దేశం లోనే ప్రతి రాష్ట్రం లో ఒక గొడవ,మన దగ్గర తెలంగాణా ఆంధ్ర అని మనం కొట్టుకుంటాం, మహారాష్ట్ర లో మరాఠీ నే మాట్లాడాలి వేరే వాళ్ళు ఉండకూడదు అని అక్కడ శివసేన.ఇలా ప్రతి రాష్ట్రం ఇలా కొట్టుకుంటూ పొతే ఇక మిగిలేది ఎవరు,ఒకప్పుడు మన map లో AP కి ఎంతో విలువుండేది,ఇప్పుడు మన రాష్ట్రం అంటేనే బయం వేస్తుంది బయటి వాళ్ళకి,ఈ 6 నెలల బీబత్సానికే మనం 6yrs వెనక పడ్డాం అబివ్రుద్దిలో,ఒక్కసారి ఆలోచించండి మన ప్రబుత్వ ఆస్తులకి ఎన్ని కోట్ల నష్టమో అవన్నీ మనవి కాదా,ఎప్పుడు గవర్నమెంట్ ఆస్తులు నష్టం అయిన దానికి రాజకీయ నాయకులో లేక రౌడి లో కారణం,కాని ఈ సారి చాలా bad ఏంటంటే,ఈ సారి గొడవలకి students కారణం,ఇప్పటికే ఎంతో విలువయిన half year వేస్ట్ చేసుకున్నారు.అమాయకులయిన స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాని ఏ ఒక్క రాజకీయ నాయకుడయిన చెసుకున్నాడా......

ఒక్కొక ఏరియా నాయకుడు తమ తమ ఏరియా లో 10 r 15 yrs నుండి MLA’s గ ఉంటారు,మళ్లీ "మా ఏరియా వెనకబడ్డది"అంటారు అంటే ఈ 10 సంవత్సరాలనుండి మీరు ముందుకి వెళ్తూ(ప్రజల సొమ్ము ని దండుకుంటూ) మీ ఏరియా ని వెనక్కి నెడుతున్నారు,మీ ఏరియా వెనకబడుతుంటే మీ ఆస్తులెలా పెరుగుతున్నాయో ప్రజలకు అర్ధం కావట్లే....చైనా లో ఒక మంచి సామెత ఉంది.“ఒక వ్యక్తికి ఒక్కరోజు కడుపు నింపడానికి చేపల కూర పెడితే సరిపోదు అదే వ్యక్తికి ఒక వల(నెట్) ని ఇస్తే వాడి జీవితాంతం జీవనోపాది కల్పించిన వాడివవుతావ్"అని.కాని మన నాయకుల దగ్గర elections వచ్చినప్పుడు మన జనాలు ఓటు కి 100 తో త్రుప్తి పడే అంత కాలం మనం మన ఏరియా వెనక పడుతూనే ఉంటుంది.

నాకు తెలంగాణా ఆంధ్ర కలిసి ఉండాలా విడిపోతే మంచిదా అని మాట్లాడే అంత knowledge లేదు. కాని ఏది మంచిదో మేధావులు అందరు కలసి కూర్చుని సామరస్యం గ తేల్చుకోవచ్చు కదా ఇంత గొడవలు చేసి సాదిచిన్దేముంది,మన ఆస్తుల్ని మనం నాశనం చేసుకోవడం తప్ప,పూర్వం ముర్ఖం గ రాజులు యుద్హాలు చేసి సాదించింది ఏముంది,ప్రజాస్వామ్య దేశం మనది.బుర్ర తో తేల్చుకోవాల్సిన విషయాన్ని కర్రతో తేల్చుకుందాం అనుకుంటున్నారేమో అని నా ఫీలింగ్…ఏ ఏరియా వాళ్ళని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు ...కొంతమంది స్వార్ధం కోసం సామాన్యుల జీవితాలతో ఆడుకోవద్దని నా ఉద్దేశం.










Your's..........సతీష్

1 comment: