Pages

Saturday, March 27, 2010

లోపం ఎవరిలో ఉంది

రాష్ట్రం లో యాక్షన్ సినిమా రిలీస్ అయింది,ఇందులో హీరో లేడు 294 ఆర్టిస్ట్స్ మాత్రమె.యాక్షన్ సినిమాలు అండ్ కామెడీ సినిమాలు నచ్చే వాళ్లకి ఈ సినిమా చాలా బాగుంటుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు(ఇది A సెర్ట్టిఫఎడ్ సినిమా).దీనికి ప్రొడ్యూసర్ ఒక్కరు ఇద్దరు కాదు 7 కోట్ల ఆంధ్రప్రదేశ్ అమాయక ప్రజలు మాత్రమె.ఈ సినిమాకి బడ్జెట్ సామాన్యుడి అంచనాలకు అందనంత.ఇంత పెద్ద బడ్జెట్ ఉన్న సినిమా ఆడేది హైదరాబాద్ లో ఒక్క దియటర్ లో మాత్రమె.ఇందులో నటించే ప్రతి పాత్ర కి ఒక గనమయన చరిత్ర ఉంటుంది.ఈ
 సినిమాని మనం బుల్లి తెర లో మాత్రమె చూడగలం..ఇంతకీ అంత గొప్ప సినిమా పేరు చెప్పలేదు కదా... అదే “అసెంబ్లీ సమావేశాలు”.
మొట్ట మొదటి సారి నేను హైదరాబాద్ మహానగరం లో అడుగు పెట్టినప్పుడు,బస్స్ లో విండో పక్కన కూర్చొని సిటీ ని చూస్తున్నాను.బస్స్ కోటి దాటింది నాకు విండో లో నుండి ఒక పెద్ద అందమయిన భవనం దాని ముందు గాంది గారి మౌనం కనిపిచ్చాయి.అదే అసెంబ్లీ అని ఎవరో పక్కనున్న వ్యక్తి చెప్తే కనుచూపు మేర దాన్నే తొంగి చూస్తూ ఉన్నాను.ఎంత ప్రశాంతం గ అందం గ  ఉంది(లోపల ఎంత బయంకరం గ ఉంటుందో తెలీదు కదా అప్పటికి),అక్కడికి మన రాష్ట్ర నాయకులందరూ వస్తారు మన భవిష్యత్తు కు బంగారు బాట వేసేందుకు అక్కడే చర్చిస్తారు అనుకున్నాను.కాని తరువాత తెల్సింది మన భవిష్యత్తు లో ఉన్న  బంగారు అవకాశాలను ఎలా దోచుకోవాలి,దోచుకున్న వాటిని కాపాడుకోవడానికి ఎలా గొడవలు పెట్టుకోవాలి అని  ఆలోచించడానికి వస్తారు అని.
మా ఊరి MLA గారు ఊరి నుండి అసెంబ్లీ సమావేశాలని 10 రోజుల ముందు హైదరాబాద్ కి వచ్చారు(మా నియోజక వర్గ ప్రజలు  మన సమస్యల మీద ఏదో చర్చిస్తారు అనే చిన్న ఆశ తో ఉన్నారనుకోండి),PA తో ఈ రోజు షెడ్యూల్ ఏంటి అనగానే PA“సర్ ఈ  రోజు మీరు అసెంబ్లీ కి వెళ్ళాలి”అన్నాడు,వెంటనే  MLA గారు అవసరమంటావా అన్నారు.PA "చాలా రోజులయింది సర్ మీరు వెళ్లి బాగోదు ఒక్కసారి వెళ్ళండి అన్నాడు.సరే వెళ్దాం అని బయల్దేరాడు.తనకి హైదరాబాద్ లో ఒక క్వార్టర్స్,తిరగడానికి 2 r 3 A/C కార్ లు రోజుకి ఎకష్త్ర కర్చులకి డబ్బులు అండ్ సెక్యురిటి ఇన్ని ఇస్తే అసెంబ్లీ కి వెళ్ళడానికి బద్ధకం.ఇక మన MLA గారు  లోపటికి ఎంటర్ అయ్యారు మొదటి గంట టీ లు,మిగిలిన MLAs తో జోక్స్ సరిపోయాయి,సభ లోకి వెళ్లారు వెనక బెంచ్ లో  గోడకి ఆనుకునే ఒక సీట్ లో కూర్చున్నారు(ఒక కునుకు తీయాలి గ మరి).ఈ లోపు మన MLA గారి వంతు వచ్చింది మాట్లాడమని,వెంటనే లేచి “నేను దీన్ని తీవ్రం గ కండిస్తున్నాను,నేను సభ ను బయికాట్ చేస్తున్నాను అని” పనికి రాణి 2 ఫైల్స్ మడిచి పట్టుకుని బయటకు వచ్చేసారు మన MLA గారు.బయట 10 మైకులు 4 కెమరా లు పట్టుకుని ఉన్న  మీడియా దగ్గరకు వెళ్లి మళ్లీ “నేను దీన్ని తీవ్రం గ కండిస్తున్న”(దేన్నీ కండిస్తున్నారో తనకి తెలీదు,అడిగిన మీడియా కి తెలీదు, చూస్తున్న మనకి తెలీదు)అని ఒక పెద్ద స్పీచ్ ఇచ్చి A/C కార్ లో తన క్వార్టర్స్ కి వెళ్ళిపోయారు.మనం సిగ్గుతో తలవంచు కోవాల్సిన విషయం ఏంటంటే అస్సలు 5yrs లో ఒక్క సారి కూడా మైక్ పట్టుకుని మాట్లాడని MLA లు,అసెంబ్లీ కి  వెళ్ళకుండా ఎగ్గొట్టే MLA లు ఉన్నారంటే మనం ఎన్నుకునే నాయకులు ఎలా ఉన్నారో వాళ్ళని ఎన్నుకున్న మనం ఎలా  ఉన్నామో.
ఏ ఒక్క MLA అన్న తన నియోజక వర్గం గురించి కాని తన నియోజక వర్గ సమస్యలను కాని అసెంబ్లీ లో లేవనేత్తుతున్నాడా …?ప్రతిపక్షం వాళ్ళు ప్రభుత్వాన్ని మీరెందుకు సరిగా పని చేయలేదు అంటే,మీరు అధికారం లో ఉన్నప్పుడు చేసారా అని అడుగుతారు,అంటే వాళ్ళు చేయలేదు కాబట్టి మీరు చేయరా.ప్రభుత్వం ప్రతిపక్షం మీ ఇద్దరేనా ఉంది,బయట అమాయకులయిన మా లాంటి వాళ్ళు కూడా ఉన్నాం.మా గురించి ఆలోచించ ర..?అస్సలు అసెంబ్లీ సమావేశాలు అయిపొఇన తరువాత రిసల్ట్ ఏంటి ఏమి సాదిన్చారో మన నాయకులకే తెలియాలి వాళ్ళని ఫాల్లో అవుతున్న మీడియా కే తెలియాలి కాని ఏ సామాన్యుడికి ఇప్పటి వరకు తెలీదు.
ఇలాంటి వాళ్ళ కోసమా సమావేశాలని లక్షల్లో ప్రజా ధనాన్ని కర్చు పెట్టడం అవసరమా,రాష్ట్రం లో ఎన్ని జిల్లాలలో కనీసం తినడానికి తిండి దొరక్క ఆకలి చావులు జరుగుతున్నాయి,ఏ దిక్కు లేని దీవులలో నో ఇలా జరుగుతుంది.ప్రభుత్వం నాయకులు ఉండి కూడా ఇంకా ఆకలి చావులు ఉన్నాయంటే అది సిగ్గు చేటు కాదా.లక్షల కోట్ల బడ్జెట్ లు ఎందుకు వేస్తున్నారు మీరు మీరు పంచుకోవడానిక ఆ డబ్బంతా ఎటు పోతుంది మళ్లీ దానిమీద చర్చలు ఏమి సాదిన్చారని.విదేశాల లో వాళ్ళ బడ్జెట్ లో మినిముం 9% ఆరోగ్యానికి స్పెండ్ చేస్తే మనం కనీసం 0.9% కూడా కేటాయిన్చాట్లేదు.CM పోస్ట్ అంటే ప్రజలకు సేవ చేసే ఒక అధికారం,మన నాయకులు పాపం ఎంతో సేవ  చేయటానికన్నట్లు ఆ సీట్ కోసం కొట్టుకు చస్తున్నారు,మన మినిస్టర్ ల లో ఒక్క రోజు CM అయిన చాలు అని గుంట దగ్గరి నక్క ల లా కాచుకునే వాళ్ళు ఎంతమంది లేరు,అదంతా ప్రజలికి సేవ చెయడానిక,కాదు ఒక్క రోజు CM పోస్ట్ లో  సంపాదించే డబ్బు ఒక తరానికి సరిపోతుంది అని వాళ్ళ ఆశ.
మరెందుకు మనం తెల్సి కూడా ఇలాంటి వాళ్ళను అలాంటి పవిత్రమయిన ప్లేస్ కి వెళ్ళేలా మనం అవకాశం ఇస్తున్నాం.నా ఉద్దేస ప్రకారం “మోసం చేసే వాడికన్నా మోసపోయే వాడిదే తప్పు”.ప్రతీ సారి మనం మన నాయకుల పనితీరు చూస్తూనే ఉంటాం,తిరిగి మళ్లీ వాళ్ళనే ఎన్నుకుంటాం.మన లో చాలా మంది అనుకుంటారు పోలిటిక్స్ మనకెందుకు ఎవడికో ఒకడికి ఓటు వేస్తె అయిపోద్దిలే అని ఆలోచిస్తాం.మనం మన కెరీర్ కోసం ఏ కోర్సు అయితే మంచిదో అని వంద సార్లు అలోచించి ఎనుకున్టామో,అంతకన్నా ముక్యంయింది మనం మన నాయకుడ్ని ఎన్నుకోవడం.ఈ విషయం మనకు అర్ధమయిన రోజు అసెంబ్లీ లో మైక్స్ విరగడం కాని మనం బూతులు వినడం కాని జరగదు.సజీవం గ ఉన్న మనమే ఏమి చేయలేనప్పుడు అసెంబ్లీ ముందు మౌనం గ కూర్చున్న గాంధీ గారు మాత్రం ఏమి చేయగలరు.
వేరే రాష్ట్రాల నాయకులు వాళ్ళ అసెంబ్లీ లో చెప్పులు,మైక్స్ లతో కొట్టుకుంటున్నారు,ఇంకా మన నాయకులు బూతుల తోనే సరిపెడుతున్నారు అని సంతోశిద్దామా లేక మన భవిష్యత్తు ని నాశనం చేస్తున్నారని బాధపడదామా…?



”నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని….అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని…మారదు లోకం….(సిరివెన్నెల…గాయం)”

ఒక్కసారి ఆలోచిద్దాం లోపం ఎవరిలో ఉందొ............ 



మీ.................................సతీష్

No comments:

Post a Comment