Pages

Tuesday, April 9, 2019

రాజకీయం రంగు మారుతుంది!!

మీ ఓటు ఏబియన్ ఆంధ్రజ్యోతి కి వేసి గెలిపించగలరని కోరిక.
మీ ఓటు సాక్షి కి వేసి ఈ సారి అధికారం ఇవ్వాల్సింది గా మనవి.
ఒకప్పుడు మీడియా పరోక్షం గా తమకి నచ్చిన పార్టీలకు మద్దతు తెలిపేవి.
కాని, ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలలో వారే పోటి చేస్తున్నట్లు  ప్రచారాలు మొదలు పెట్టారు.
ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటె ప్రజల మద్ధతు, నాయకుల తోడ్పాటు ఉండాలి.
కాని, ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టాలంటె ఒక మీడియా చానెల్ ఉంటే చాలు.
రాజకీయాలు భ్రష్టు పట్టిపొయాయి అంటే బాధ కలిగేది, కాని జర్నలిజం రాజకీయం అయిపొతుంది అంటే భయం గా ఉంది.


మార్పు రావాల్సింది రాజకీయాలో, జర్నలిజాలో కాదు. మారాల్సింది ప్రజలే అని ఆసిస్తూ...........మీ సతీష్ ధనేకుల!!

13 comments:

  1. నేరస్థులు రాజకీయ నాయకులూ ప్రజాప్రతినిధులూ అవుతున్న రోజుల్లో జర్నలిష్టులు తమతమ విశ్లేషణలను వినిపిస్తే మాత్రం ఎందుకంత గోల అని?

    ReplyDelete
    Replies
    1. విశ్లేషణ వినిపిస్తే తప్పు లేదండి, విశ్లేషణ అనేది ఒకే కోణం నుండి చూసి చెప్పేది కాదు అని నా అభిప్రాయం.

      Delete
  2. ఈ పోకడలు మొదలు పెట్టిన ఘనత రామోజీరావుదే. రామారావు రోడ్డెమ్మట తానాలు చేసే ఫోటోలు రామోజీ మొదటి పేజీలో వేసాడు. ఈనాడు విలేఖర్లు టీడీపీ కార్యకర్తల్లా పని చేసేవారు.

    ReplyDelete
  3. నమస్తే తెలంగాణా, తెలంగాణా న్యూస్ చానెల్స్ మాత్రం తక్కువ తిన్నాయా ? అంతా గులాం మయం ! చావు తెలివితేటలు !

    ReplyDelete
    Replies
    1. సామ్నా నుండి ప్రజాశక్తి వరకు ఎన్నెన్నో మాధ్యమాలు తమ పార్టీ అఫ్లియేషన్ బహిరంగంగా చెప్పుకుంటున్నాయి. రామోజీ వేమూరి వంటి వాళ్ళు తటస్థులమని చంకలు గుద్దుకుంటున్నారు.

      Delete
    2. ఇంతకీ మీరు తటస్థులేనా?

      Delete
    3. సూర్య గారూ, జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు సాక్షి ఈనాడు తరహాలో "తానాల సీనులు" చూపించలేదు: అలా చేవుంటే నేను తప్పక ఖండించే వాడిని. ఇకపోతే మీరు నేను లక్షలాది మందిని ప్రభావితం చేసే పేపర్లను/టీవీలను నడపడం లేదు కదండీ.

      Delete
    4. సారీ మీ జవాబు అర్థం కాలేదు. ఇకపోతే ఆ తానాల సీనేంటో అది వేస్తే మీకేం అభ్యంతరమో అస్సలు అర్థం కావట్లేదు.
      నేనూ కొన్నాళ్ళు సాక్షి చదివాను. దాన్ని ఒక పత్రిక అని నేనైతే పిలవలేను

      Delete
    5. @సూర్య:

      "రామారావు రోడ్డెమ్మట తానాలు చేసే ఫోటోలు రామోజీ మొదటి పేజీలో వేసాడు"

      మొదటి పేజీలో పెద్దాయన రోడ్డు పక్క స్నానాలంటూ శీర్షికలు పెట్టే స్థాయి వ్యక్తిపూజకు దిగజారడం ఈనాడుతోనే మొదలు. ఎమర్జెన్సీ కాలంలో "India is Indira, Indira is India" అని భజనలు చేసిన వారు సైతం అంత "సాహసం" చేయలేదు.

      సాక్షి, నమస్తే తెలంగాణా, శివసేన సామ్నా (నమో టీవీ కూడా) వగైరాలు పార్టీ కరపత్రాలు.

      Delete
    6. మీకు నచ్చని ప్రతివార్త వాళ్ళు వేసి ఉండకూడదంటే నేనేం చెప్పలేను. మీరు తటస్తులు కారని ఒప్పుకున్నట్లేగా.

      Delete
  4. Jai Garu. Did you ever comment on the blatant hate propaganda of T news channel. Yellow media has polluted the polity. No-one can beat them in systematic character assassination. Now every paper or channel has its own agenda. Disgusting scenario.

    ReplyDelete
    Replies
    1. Agreed but T-News etc. are openly party papers.

      My objections was to those who claim to be neutral. Let them also drop the mask of neutrality and declare their affiliation.

      "రామోజీ వేమూరి వంటి వాళ్ళు తటస్థులమని చంకలు గుద్దుకుంటున్నారు"

      Delete
    2. They will never drop their mask hiding the casteist and political facade. The mask is all too transparent. So it makes no difference. Still the yellow or Andhra media never crossed the line in propagating sub regional hatred. T news ran and still runs preposterous hate campaign against Andhra people. I have not seen a single Telangana native condemning them. It is akin to the blind support of Muslims to owaisi.

      Delete