Pages

Tuesday, May 3, 2011

పాలు పోసి పెంచిన పాములు

మనకి ఒక సామెత ఉంటుంది "పాముకి పాలు పోసి పెంచినా అది విశ్వాసం మరచి పాలుపోసిన వాడినే కాటేస్తుంది"అని.అది నిజమే వీడు పోసినంత కాలం అది తాగుతూనే ఉంటుంది కాని ఏదో ఒక రోజు తప్పక కాటు వేస్తుంది అని మన చరిత్రలో రుజువైంది,మన కళ్ళ ముందు కుడా జరుగుతూనే ఉంది.

మన కళ్ళముందే జరిగిన ఇలాంటి కొన్ని సంగటనలు చూద్దాము:
చలసాని వెంకటేశ్వర రావు: 
చలసాని వెంకటేశ్వర రావు అలియాస్ పండు హత్య, స్వాప్నిక పెరల్ అపార్ట్మెంట్, హైదరాబాద్ లో జరిగింది. పండు ని అతి దారుణంగా చంపింది అతను నమ్మిన బంటు,ప్రధాన అనుచరుడైన మహేందర్ రెడ్డి. దీనికి కారణం భూ దందాలు,మనీ గొడవలే ముఖ్య కారణం.
గంగుల సూర్యనారాయణ రెడ్డి:
అలియాస్ మద్దెల చేరవు సూరి, సూరి హత్య నవోదయ కాలనీ,జూబిలీ హిల్స్,హైదరాబాద్ లో జరిగింది.సూరిని అతి కిరాతకంగా కాల్చి చంపింది సూరికి అత్యంత నమ్మకస్తుడు భానుకిరణ్.ఈ హత్యకి కుడా ప్రధాన కారణాలు భూ దందాలు,డబ్బే ప్రధాన కారణం.సూరి నమ్మేది అతి తక్కువమందిని అందులో ముఖ్యుడు భానుకిరణ్.ఆకరికి అతనే సూరిని అతి కిరాతంగా కాల్చేసాడు.

అక్బరుద్దీన్ ఒవైసీ(MLA):
అక్బరుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ MIM MLA.నడి రోడ్డు మీద కొంతమంది వ్యక్తులు అతి దారుణంగా కత్తులతో తుపాకులతో దాడి చేసి అక్బర్ను గాయపరిచారు.అదృష్టవశాత్తు అక్బర్ ప్రాణాపాయ స్థితినుండి తప్పించుకుని బయట పడ్డాడు,కాని పరిస్థితి విషమంగానే ఉంది.ఈ దాడికి ప్రధాన కారకుడు మొహమ్మేద్ పహల్వాన్.పహేల్వాన్ అక్బరుద్దీన్ తండ్రి సుల్తాన్ సలహుద్దిన్ ఒవైసీ కి అనుచరుడు ఒకప్పుడు.వీళ్ళ ద్వారానే అక్రమంగా ఎన్నో ఆస్తులు కూడపెట్టాడు.ఇప్పుడు అక్బర్ వలన ఈ ఆస్తులకు ముప్పు అని భావించి అక్బరుద్దీన్ ని అడ్డు తప్పిచడానికి ప్రయత్నించాడు.
ఒసామా బిన్ మొహమ్మేద్ బిన్ అవాద్ బిన్ లాడెన్:
అలియాస్ ఒసామా బిన్ లాడెన్ ప్రపంచ దేశాలను అందులో ముఖ్యంగా అగ్ర రాజ్యం అని పిలవబడే అమెరికాను గడగడ లాడించాడు.ఎవరూ ఉహించని రీతి లో WTO మీద దాడి చేసి అమెరికాను ఒక్కసారిగా హడలెత్తించాడు.ఇంతకీ ఎవరీ లాడెన్.....ఒక వ్యక్తి ప్రపంచ దేశాలను ఎలా భయపెట్టగలిగాడు….?లాడెన్ అనే ఒక వ్యక్తి ఒక ఉగ్రవాద శక్తిగా మారటానికి ప్రధాన కారణం ఈ అగ్రరాజ్యమే,తన స్వార్ధం కోసం సోవియట్ యునియన్ (రష్యన్) దళాలను నాశనం చేయడానికి లాడెన్ ని ఉపయోగించుకుని అతనికి ఆయుధాలు డబ్బులు సహాయంగా అందించి అతన్ని ఒక శక్తిగా మార్చింది.తన స్వార్ధం కోసం పెంచి పోషించిన ఒక శక్తి తమకే పక్కలో బల్లెంలా తయారయ్యే సరికి తట్టుకోలేకపోయిన అగ్రరాజ్యం అతనిపయి  దాడిచేసి అతన్ని అంతమొందించి మేకపోతు గామ్భిర్యాన్ని ప్రదర్శిస్తుంది ఇప్పుడు.

వీటి అన్నిటిలో నీతి ఒక్కటే తమ స్వార్ధానికి,సొంత పనులకు పాముల లాంటి వాళ్ళను పెంచి పోషించి సమాజానికి నష్టం కలగించినంత కాలం వీరు దర్జాగా బ్రతుకుతున్నాము అనే బ్రమలో ఉంటారు,కాని అదే పాముల విషపు కాటుకి ఏదో ఒకరోజు భళి అవుతారని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. మల్లీ మన సామెత దగ్గరికి వస్తే “కత్తి పట్టిన వాడు ఆ కత్తి చేతిలోనే చస్తాడు”.అని……………………..సతీష్.



No comments:

Post a Comment